ఢిల్లీలో వైసీపీకి షాక్.. జగన్ ధర్నాకు అడ్డంకి ?

-

ఢిల్లీలో వైసీపీకి షాక్ తగిలింది. నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు సిద్ధమైన వైసీపీ అధినేత జగన్‌కు షాక్ తగిలింది. నిరసనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీలో వైసీపీ శిబిరం దీక్ష వద్దకు వైసీపీ నేతలు చేరుకుంటున్నారు.

 

YCP chief Jagan gets a shock as he prepares to protest at Jantar Mantar in Delhi

మరోవైపు టీడీపీ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు గుర్నాథం చేపట్టనున్న దీక్షకు అనుమతి నిరాకరించారు. కాగా, చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా… ఈ ధర్నాకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గడిచిన 50 రోజుల్లో 36 హత్యలు ఏపీలో జరిగాయి.1000 కి పైగా దాడలు జరిగిన నేపథ్యంలో… కూటమి ప్రభుత్వం మారడం హోమం సాగిస్తోందని… జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

వైసీపీ నేత రషీద్ హత్య కేసు సంఘటన నేపథ్యంలో… ఏపీలో రాష్ట్రపతి పాలన కూడా వేయాలని.. డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమి వచ్చిన తర్వాత ఏపీ మొత్తం.. బీహార్ రాష్ట్రంల మారిపోయిందని… నిప్పులు చెరిగారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జాతీయస్థాయిలో తెలియజేయాలనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news