ఈ నెల 7న వైసీపీ జయహో బీసీ మహాసభ – పోస్టర్ విడుదల

-

ఈ నెల 7న వైసీపీ జయహో బీసీ మహాసభ జరుగనుంది. విజయవాడలో ఈనెల 7న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో “వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ-వెనుకబడిన కులాలే వెన్నెముక” సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే వేదిక ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు శ్రీ జోగి రమేష్, శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల్, శ్రీ కారుమూరి నాగేశ్వరరావు, అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.

అనంతరం.. వైయస్సార్ సీపీ జయహో బీసీ మహాసభ పోస్టర్ ను మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ జోగి రమేష్, శ్రీ చెల్లిబోయిన వేణుగోపాల్, శ్రీ కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు శ్రీ మార్గాని భరత్, శ్రీమతి బీ.సత్యవతి, శ్రీ మోపిదేవి వెంకటరమణ తదితర బీసీ నేతలతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు మంచి చేస్తుందని తెలిపారు. మా పార్టీకి గతంలో వచ్చిన ఓట్లు, సీట్లకంటే ఎక్కువ వస్తాయని వెల్లడించారు. మళ్లీ మా పార్టీనే అధికారంలోకి వస్తుంది. శాంతి భద్రతలు బాగున్నాయి. ప్రజల్లో సానుభూతి కోసమే నన్ను చంపుతారు అంటూ చంద్రబాబు డ్రామాలు అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news