జడ్జిలు రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదు – వైసీపీ MLC డొక్కా

-

జడ్జిలు రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్. కోర్టుల వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మా పార్టీకి, ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ అంటే అపారమైన గౌరవం ఉందనన్నారు. అందుకే చాలా సందర్భాల్లో ఇబ్బంది అయినా సంయమనం పాటించామని పేర్కొన్నారు.

ఒక న్యాయమూర్తి ముందస్తు ఎన్నికల పై వ్యాఖ్యలు చేశారు..ప్రజలను దొంగలుగా మారుస్తారా? వంటి వ్యాఖ్యలు ఆ న్యాయమూర్తి చేసినట్లు పత్రికలు రాశాయన్నారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీంకోర్టు, రాష్ట్రపతి వంటి వారే చెప్పారని తెలిపారు.

 

 

న్యాయమూర్తులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి..ఒక రాజకీయ పార్టీకి ఉపయోగపడే విధంగా వ్యవహరించ వద్దని కోరుతున్నామన్నారు.రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మా ప్రభుత్వం వ్యవహరిస్తే ఆ మేరకు తీర్పు ఇవ్వండి..ఒక వ్యవస్థ పరిధిలోకి మరో వ్యవస్థ జొరబడటం కరెక్ట్ కాదన్నారు డొక్కా.

 

Read more RELATED
Recommended to you

Latest news