సింహం వేట ఎలా ఉంటుందో… వైసీపీ నేతలకు చూపిస్తాం.-యరపతినేని

-

చంద్రబాబు మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దని.. సింహం వేట ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిస్తామని హెచ్చరించారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు. పల్నాడులో జరిగిన ప్రతీ హత్యా, దాడి లెక్కలు రాసి పెట్టుకున్నామని.. ఏపీకి జగన్ తాత్కాలిక సీఎం మాత్రమేనని పేర్కొన్నారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చిన సింహాలు ఎన్టీఆర్, చంద్రబాబు.. వారి వారసుడే లోకేష్ అని పేర్కొన్నారు.

రాయలసీమలో కులాల కుంపటి పెట్టి ఫ్యాక్షనుకు అడ్డాగా మార్చిన రాజారెడ్డి, వైఎస్సార్ వారసత్వం జగనుదని.. రాజకీయంగా రాయలసీమను అప్రదిష్టపాలు చేసిన గ్రామ సింహాలు జగన్ కుటుంబ సభ్యులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు లో కుప్పకూలుతున్న సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో వరుస హత్యలు, ఊచకోతలకు పాల్పడుతున్నారని.. పిన్నెలి రామకృష్ణ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం పతనావస్థకు చేరాయని విమర్శలు చేశారు.

సొంత బాబాయిని చంపిన ఏ1 ముద్దాయి ఎవరంటూ పిన్నెలి మతిభ్రమించి మాట్లాడుతున్న తీరును ఆపార్టీ నేతలే గ్రహించుకోవాలని… అక్రమ మద్యం, విగ్రహాల దొంగతనంతో పాటు ఎన్నో అసాంఘిక కార్యకలాపాల కేసులు పిన్నెల్లిపై ఉన్నాయని ఫైర్‌ అయ్యారు. పేదల కడుపు నింపే పార్టీ తెలుగుదేశం, పొట్టగొట్టే పార్టీ వైసీపీ అని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news