సామాన్యులపై మరో భారం.. ఆ ఉత్పత్తులపై భారీగా ధరల పెంపు..

-

ప్రభుత్వం ప్రజలపై పన్ను భారం వేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో వస్తువుల పై టాక్స్ వేస్తుంది. కాగా, ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే పాలు,పెరుగుల పై పన్ను వేస్తుంది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్‌టీ కౌన్సిల్ 47వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే..కొన్ని ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులపై మినహాయింపులు ఉండేవి. జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఆ మినహాయింపుల్ని తొలగించడంతో ఆ ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తుల ధరలు పెరగబోతున్నాయి.

ప్రీ-ప్యాక్డ్, ప్రీ-లేబుల్డ్ పెరుగు, లస్సి, బటర్ మిల్క్ లాంటి వస్తువుల ధరలు మరి కొద్ది రోజులలో పెరగనున్నాయి.. పెరుగు, లస్సీ లాంటి పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్‌టీ వర్తించనుంది. ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు లేని వీటిపై ఇక జీఎస్‌టీ చెల్లించక తప్పదు.దీంతో, డెయిరీ కంపెనీలు ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.పాల ఉత్పత్తులపైన జీఎస్‌టీ అమలులోకి రానుంది. దీంతో పాలతో తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటిపై 5 శాతం జీఎస్‌టీ విధించడంతో డెయిరీ కంపెనీలు ధరలు పెంచి ఆ భారాన్ని కస్టమర్లపైన వేయనున్నాయి..పాలు, పెరుగు లేనిదే పూట గడవదు..దాంతో చాలా మంది ఎంతైనా పెట్టి కొనక తప్పదు.

ఐస్‌క్రీమ్, చీజ్, నెయ్యి, పన్నీర్ లాంటివాటిపై జీఎస్‌టీ ఉంది. పెరుగు, లస్సీపై జీఎస్‌టీ విధిస్తే ఇక పాల ఉత్పత్తులన్నీ జీఎస్‌టీ గొడుగు కిందకు వస్తాయి. అయితే ప్యాకేజ్డ్ పాలపై జీఎస్‌టీ లేకపోవడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలపైనే కాదు, ఇతర వస్తువులపైనా కూడా భారీగా జీఎస్‌టీ భారీగా పెరిగింది..

తాజాగా ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్, కత్తులు, పెన్సిల్ షార్పెనర్స్, బ్లేడ్లు, ఫోర్క్స్, స్పూన్స్, సెంట్రిఫ్యుగల్ పంప్స్, డీప్ ట్యూబ్ వెల్ టర్బైన్ పంప్స్, సబ్‌మెర్సిబుల్ పంప్స్, బైస్కిల్ పంప్స్‌, వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, గుడ్లను శుభ్రపర్చేందుకు ఉపయోగించే యంత్రాలు, డెయిరీ పరిశ్రమలో వాడే మెషీన్లు..ఎల్ఈడీ బల్బులు, లైట్లు, ఇతర పరికరాలు, మెటల్ ప్రింటెడ్ సర్క్యుట్ బోర్డులు, రోడ్లు, బ్రిడ్జీలు, మెట్రో, ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, క్రిమెటేరియం పనులు, టెట్రా ప్యాక్‌లపై, క్లీనింగ్, సార్టింగ్, గ్రేడింగ్, విత్తనాలు, ధాన్యాల కోసం ఉపయోగించే యంత్రాలు, మిల్లింగ్ పరిశ్రమలో వాడే యంత్రాలు, వెట్ గ్రైండర్స్ మొదలగు వస్తువుల పై జీఎస్‌టీ ని పెంచిన విషయం పెంచిన సంగతి తెలిసిందే..ఈ కొత్త జీఎస్‌టీ జూలై 18 నుంచి అమలు కానుంది.ఇంకొద్ది రోజులు పోతే నిలుచున్న స్థలానికి, పీల్చె గాలికి కూడా బిల్ వేస్తారేమో అంటూ జనాలు ఆరొపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news