ఏపీలో మరో ఘాతుకం.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టి..!

-

విజయనగరం: గుంటూరు రమ్య ఘటన మరువ ముందే ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. తాజాగా విజయనగరం జిల్లాలో ప్రేమోన్మాది పాల్పడిన ఘాతుకానికి ముగ్గురు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే… విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చౌడువాడ లో నిన్న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో రాములమ్మ అనే యువతి పై రాంబాబు అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

అయితే.. ఈ ఘటన లో యువతి తో పాటు ఇంట్లో ఉన్న బాధితురాలి అక్క, ఆమె కుమారుడుకు కూడా గాయాలు పాలయ్యారు. స్థానికులు అప్రమత్తమై… వెంటనే గాయపడిన ముగ్గురిని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. రాంబాబు ను కాదని.. యువతికి వేరే అతనితో పెళ్లి నిశ్చయమైన నేపథ్యం లోనే… ఈ దాడికి నిందితుడు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news