BREAKING : పవన్‌ కళ్యాణ్‌కు మరో అవమానం..ముఖంపై టవల్‌ విసిరిన ఫ్యాన్స్‌ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ పర్యటన లో ఉన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు మరో ఘోర అవమానం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నర్సాపురం బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో… కొంత మంది జనసేన పార్టీ నేతలు.. పవన్‌ కళ్యాణ్‌ ముఖంపై టవల్‌ విసిరేసారు.

ఆ టవల్‌ కాస్త… జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ముఖంపై పడిపోయింది. దీంతో పవన్‌ కళ్యాణ్‌ కాస్త అసహనానికి గురయ్యారు. అనంతరం యథావిధిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు పవన్‌ కళ్యాణ్‌.

తాను రాజీలేని యుద్దం చేస్తున్నానని… మత్స్యకారుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు పవన్‌ కళ్యాణ్‌. దారిపొడుగునా గోతులు తీ సి చ‌క్క‌ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్ర‌భుత్వం అని నిప్పులు చెరిగారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌… సంయ‌మ‌న‌మే మా బ‌లమని.. అక్ర‌మ కేసుల‌కు వ్య‌తిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడుతానని హెచ్చరించారు జ‌న‌సేనాని ప‌వ‌న్. జగన్‌ సర్కార్‌ కు తగిన బుద్ది చెబుతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news