BREAKING : ఏపీలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదు.. 3 కు చేరిన సంఖ్య

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తాజాగా మరో ఒమిక్రాన్‌ కేసు నమోదు అయింది. తూర్పు గోదావరి జిల్లా అయినవెల్లి మండలం నేదునూరి సావరంలో ఒమిక్రాన్‌ కేసు నమోదు అయినట్లు వైద్య శాఖ గుర్తించింది. ఈ నెల 19 వ తేదన కువైట్‌ నుంచి వచ్చిన ఓ మహిళ కు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ఆ మహిళకు ఒమిక్రాన్‌ వైద్యం అందిస్తున్నారు. ఇక ఇవాళ నమోదైన కేసు తో ఏపీలో మూడుకు చేరింది ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య.

ap carona
ap carona

కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఇందులో విజయవాడలో ఒకరికి ఒమిక్రాన్‌ సోకగా … తిరుపతి వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ వైరస్ సోకింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 135 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,76, 212 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధి లో మరో ముగ్గు రు చని పోవడం తో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 486 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news