కేంద్రానికి మంత్రి కేటీఆర్ మరో బహిరంగ లేఖ..సిమెంట్‌ కార్పోరేషన్ ఏర్పాటు చేయండి

-

కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండే లకు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పున:ప్రారంభించాలని.. ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పోరేషన్ ఆఫ్‌ ఇండియా యూనిట్‌ను తిరిగి తెరిచేందుకు ఎన్నో సానుకూల అంశాలు, అవకాశాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలోనే కాదు దేశీయంగా కూడా సిమెంట్‌కు భారీ డిమాండ్ ఉందని.. దేశంలోని ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయన్నారు.

ktr

సీసీఐ కంపెనీ పున:ప్రారంభానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని.. కంపెనీ ప్రారంభిస్తామంటే కొత్త కంపెనీలకిచ్చే ప్రొత్సాహకాలు, వెసులుబాటు కల్పిస్తామని ప్రకటన చేశారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని ఈ విషయంలో కలిసి విజ్ఞప్తి చేశామని.. సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరినా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదని మంత్రి కేటీఆర్‌ అవేదన వ్యక్తం చేశారు.

మా కృషి వలన అదిలాబాద్ దేవాపూర్‌ యూనిట్‌లో ఒరియంట్ సిమెంట్ కంపెనీ సుమారు రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టిందని.. మేం ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంటే, సీసీఐ లాంటి కంపెనీలను తెరవక కేంద్రం ఉపాధి అవకాశాలపై దెబ్బ కొడుతోందన్నారు. సీసీఐ తిరిగి తెరిస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయని.. మేం అన్ని రకాలుగా సహకరిస్తామంటున్నా సీసీఐని తెరవకపోవడం తెలంగాణ యువత, ముఖ్యంగా అదిలాబాద్ యువతకు తీరని ద్రోహమే అని పేర్కొన్నారు. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ది చెందుతుందని.. కేంద్రం ప్రభుత్వం వేంటనే సీసీఐ పున:ప్రారంభానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news