దళిత బంధు కోసం మరో 500 కోట్లు విడుదల…

-

తెలంగాణ దళిత బంధు పథకం నేపథ్యం లో కెసిఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం , నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.

పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసుకున్నది. కాగా దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు నిధుల విడుదల వివరాలు ఒకసారి చూద్దాం. తేదీ 9 వ తేదీ నాడు రూ. 500 కోట్లు విడుదల చేయగా.. 23 న రూ. 500 కోట్లు విడుదల చేసింది సర్కార్. అలాగే 24 న రూ. 200 కోట్లు విడుదల చేయగా.. 25 న రూ. 300 కోట్లు విడుదల చేసింది. ఇక నేడు మిగిలిన రూ. 500 కోట్లు విడుదల చేసింది సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version