ఏపీలో దారుణం.. చిన్న గొడవ ప్రాణాలు తీసింది ! 

-

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద ఆగి ఉన్న లారీని సిమెంట్ లోడుతో వెళ్తున్న మరో లారీ ఢీకొన్న ఘటనలో  ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు గామాలపాడు కు  చెందిన సీతారామయ్య, జానీ బాషాలుగా గుర్తించారు. దీంతో గుంటూరు జిల్లా దాచేపల్లి (మం) గామలపాడులో విషాదం నెలకొంది.

ఒక చిన్న గొడవ వీరి ప్రాణాలు తీసిందని అంటున్నారు. చిన్న విషయానికి ఇద్దరు లారీ డ్రైవర్ లు సీతారామయ్య, జానీ బాషాలు గొడవకు దిగారు. వారు గొడవ పడుతున్న సమయంలో వారిని చూసుకోకుండా వారి మీదుగా మరో లారీ దూసుకెళ్లిన నేపధ్యంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ డ్రైవర్ల తగాదాలో తలదూర్చిన మరో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news