BREAKING: ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇక ఈ అసెంబ్లీ సమావేశంలో పలు కీలక బిల్లును చర్చకు రానున్నట్లు సమాచారం అందుతుంది.

 

అంతేకాదు ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ అధ్యక్షతన సచివాలయం బ్లాక్ 1లో ఉదయం 11 గంటలకు సమావేశం కానుoది మంత్రి మండలి.

 

ఇక ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల అధికారులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం అందుతోంది.ఇక ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news