విషాదం : తండ్రి దాడిలో గాయపడ్డ బాలుడు మృతి

-

హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో విషాదం చోటుచేసుకుంది. తండ్రి దాడిలో గాయపడ్డ బాలుడు చేతన్ మృతిచెందాడు. నాలుగు రోజుల క్రితం కొడుకు మీద టర్పెంటాయిల్ పోసి తండ్రి నిప్పంటించిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం బాలుడు చేతన్ మృతి చెందాడు. చదవకుండా టీవీ చూస్తున్నాడు అని ఆగ్రహంతో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.  వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం చెందిన బాలు పొట్టకూటి కోసం నగరానికి వచ్చాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే గుడిసె వేసుకుని కుటుంబంతో సహా జీవిస్తున్నాడు.

బాలు కూలి పనులు చేస్తుండగా భార్య సోనీ అదే పాఠశాలలో ఆయాగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు చేతన్ అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. నేరుగా తరగతులు జరగకపోవడంతో ఆన్లైన్లోనే క్లాసులు వింటున్నాడు. మొన్న ఆదివారం నాడు బాలు పనికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి చరణ్ టీవీ చూస్తూ కనిపించాడు. నీ కొడుకు ఆన్లైన్ తరగతులకు హాజరు కాకుండా ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటున్నాడని బాలుతో భార్య సోని చెప్పింది. ఈ గొడవ పెద్దది అవ్వగా పాఠశాలకు పెయింట్ వేయడానికి తీసుకొచ్చిన టర్పెంటాయిల్  చరణ్ మీద పోసి ఒక్కసారిగా నిప్పంటించాడు బాలు. చేతన్ అరుపులకు స్థానికులు అక్కడికి చేరుకుని అతని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం చేతన్ మరణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news