రఘురామకు జగన్‌ బిగ్‌ షాక్‌..ఎంపీ ఇంటికి మరోసారి ఏపీ సీఐడీ

-

వైసీపీ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు మరో షాక్‌ తగిలింది. ఇవాళ తాజాగా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. నలుగురు అధికారులు రఘురామ కృష్ణరాజు ఇంటి వద్ద వెయిట్‌ చేస్తున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారని సమాచారం అందుతోంది. రఘురామ కృష్ణరాజు బయటకు రాకపోవడంతో ప్రస్తుతం వారు బయటే వెయిట్‌ చేస్తున్నారని సమాచారం.

అయితే..ఏ కేసుకు సంబంధించి.. రఘురామ కృష్ణరాజు నోటీసులు ఇస్తున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అదే సమయంలో.. గతంలోనే సీఐడీ అధికారులు పలు రకాల కేసులు రఘురామ కృష్ణరాజు పై నమోదు చేసి ఉండటంతో.. వాటికి సంబంధించి నోటీసులు ఇవ్వనున్నారా.. లేక.. అదుపులోకి తీసుకుంటారా అనేది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా.. గత కొన్ని రోజుల కిందట రఘురామ కృష్ణరాజును అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా అంశం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news