ఏపీలో కరోనా కలవరం..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంబిస్తుంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ప్రభత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే ఈ మహమ్మరిని మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 253 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 82 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 84కి పెరిగింది. ఇప్పటివరకు ఏపీలో 4,841 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,723 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,034 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలోనే కరోనా తీవ్రత పెరిగిందని కొందరుఅభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news