ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 809 కేసులు

-

ఏపీలోనూ కరోనా ఉధృతి రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. ఏపీ లో నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 809 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,51, 133 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 10 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 186 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11, 142 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 56, 463 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 83 , 50 , 167 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో 1, 160 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,25, 805 లక్షలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news