ఏపీలో కొత్తగా 264 కరోనా కేసులు, ఒక మరణం

-

ఏపీలో కరోనా కేసులు ఇవాళ మరోసారి పెరిగిపోయాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ పెరిగి పోయాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 264 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,71, 831 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో ఒకరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 430 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2175 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 247 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,55 , 226 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 31 , 987 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 02 , 55 , 667 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news