ఏపీలో కేవ‌లం 75 కరోనా కేసులు, ఒక మ‌ర‌ణం న‌మోదు

-

ఏపీలో క‌రోనా కేసులు భారీగా త‌గ్గు పోయాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ భారీగా ప‌డిపోయాయి. తాజాగా హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 75 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2075879 కి పెరిగింది. ఇక కోవిడ్ వల్ల కృష్నా లో ఒకరు మరణిం చారు.

ap carona
ap carona

దీంతో క‌రోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14480 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1517 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 154 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2059882 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీ లో 21,211 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,10,11,507 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news