ఏపీలో కొత్తగా 166 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదు

-

ఏపీలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 166 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,77, 145 కి పెరిగింది.

carona ap
carona ap

ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 495 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1154 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 91 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 61, 496 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 31 , 844 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 13 , 27 ,131 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు ఏపీ ఇప్పటి వరకు 17 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news