ఏపీలో తగ్గిన కరోనా తీవ్రత..ఇవాళ కొత్తగా 3,396 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త తగ్గాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 3396 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2300765 కి పెరిగింది.కోవిడ్ వల్ల అనం తపురము, నెల్లూరు మరియు ప్రకాశం లలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు మరియు కర్నూలులలో ఒక్కొక్క రు చొప్పున మరణించారు.

ap carona
ap carona

దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14655 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78746 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 13,005 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2207364 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 29,838 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,26,32,089 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news