అసెంబ్లీలోకి మొట్టమొదటి సారిగా ఏపీ గవర్నర్..

-

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శాసన సభకు హాజరు కానున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఆన్లైన్ విధానంలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ విడత ఆయన నేరుగా సభకు వచ్చి ప్రసంగించనున్నారు.

గవర్నర్ వస్తున్న నేపథ్యంలో… ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలో రాజ్ భవన్ అధికారులు పూర్తిస్థాయి ట్రయల్ నిర్వహించారు. విజయవాడ రాజ్ భవన్ నుంచి గవర్నర్ శాసనసభ కు చేరుకునే మార్గం, శాసనసభలో ఏ గేటు నుంచి కాన్వాయ్ లోపలికి ప్రవేశిస్తుంది. సీఎం జగన్ ఆయనకు ఎక్కడ స్వాగతం పలుకుతారు ? అనే అంశాలపై సిసోడియా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఇవాళ గవర్నర్‌ ప్రసంగం అనంతరం.. ఏపీ కేబినేట్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమరావతిపై కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news