ఏపీలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు – వైద్య ఆరోగ్య శాఖ

-

ఏపీలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కొవిడ్ మరణాలు సంభవిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని.. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ప్రకటన చేశారు. కాకినాడలో 21 ఏళ్ల ప్రసాద్ అనే వ్యక్తికి ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది.

ap carona
ap carona

అయితే వైరల్ న్యూమోనియా కారణంగా మరణించాడని కాకినాడ జిజిహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారని ఫైర్‌ అయ్యారు. అలాగే 26 ఏళ్ల సందీప్ అనే వ్యక్తికి ఆర్టీపీసీఆర్ పరీక్ష లో పాజిటివ్ వచ్చింది. నెక్రోటైజింగ్ ప్యాంక్రియాలైటిస్ కారణంగా మరణించినట్టు నివేదిక లో సూపరింటెండెంట్ పేర్కొన్నారన్నారు. వైజాగ్ లో 21 ఏళ్ల పి.చింటో కూడా వైరల్ న్యూమోనియాతో మరణించినట్టు కెజిహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారని.. ఇతనికి ఆర్టీపీసీఆర్ పరీక్ష లో నెగటివ్ అని తేలిందని వెల్లడించారు కమీషనర్ జె.నివాస్.

Read more RELATED
Recommended to you

Latest news