సీఎం జగన్ నిజమైన కమ్యూనిస్ట్ – మంత్రి సీదిరి అప్పల రాజు

-

సీఎం జగన్ నిజమైన కమ్యూనిస్ట్ అని వ్యాఖ్యనించారు మంత్రి సీదిరి అప్పల రాజు. 90 వేల మంది రైతులకు 182 కోట్లుఅదనపు పరిహారం ఇస్తున్నామని.. తితీలి ఉద్దానం ప్రాంతప్రజలకు తీరనీ గాయం చేసిందని చెప్పారు. టిడిపి కంటితుడుపు చర్యలుగా పరిహారం ఇచ్చిందని… నాడు అహార పదార్దాలు సైతం వారి పార్టీ వారికే పంచుకున్నారని ఆగ్రహించారు.

నష్టపోయిన కొబ్బరి చెట్టుకు 1500 కి బదులు 3000 అని.. జీడి కి హెక్టార్లలో కి 30 వేలకు బదులు 50 వేలు అదనపు పరిహారం ఇస్తామని హామి ఇచ్చారన్నారు. కిడ్ని వ్యాధులతో ఉద్దానం ప్రజలు కష్టాలు పడుతున్నారని.. ఉద్దానం కష్టాలు గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.

జగన్ సీఎం అయ్యాక డయాలసిస్ పేషేంట్లకు 10 వేల పెన్షన్ ఇస్తున్నామని.. అనేక ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసామని గుర్తు చేశారు. ఉద్దానం వాసుల చిరకాల కోరిక సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ నిర్మాణం యుద్ద ప్రాతిపదిక న నిర్మిస్తున్నామని.. 700 కోట్లతో శుద్ద జలాల పంపిణీ కి ప్రాజెక్ట్ నిర్మాణం చెపట్టామని చెప్పారు. టిడిపి వారు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని.. జగన్ పై విమర్శలకు దిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news