ఐపీఎల్ 2023: ఆర్సీబీ బౌలింగ్… మరో “ఐ ఫీస్ట్” ఇన్నింగ్స్ కి సిద్దమేనా !

-

ఈ రోజు కోలకతా వేదికగా కేకేఆర్ మరియు ఆర్సీబీ ల మధ్యన మ్యాచ్ జరగనుంది. కోల్కతా తన మొదటి మ్యాచ్ లో పంజాబ్ పై ఓటమి చెందగా , ఆర్సీబీ మాత్రం తొలి మ్యాచ్ లో ముంబై ను అలవోకగా ఓడించింది. కాగా ఈ రోజు కోల్కతా సొంత అభిమానుల ముందు గెలవడం చాలా అవసరం అని చెప్పాలి. అందులో భాగంగా టాస్ గెలిచినా ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లోనూ ఇదే సూత్రాన్ని పాటించిన ఆర్సీబీ మెరుగైన ఫలితనాన్ని అందుకుంది.

ఆ మ్యాచ్ లో ఓపెనర్లు కోహ్లీ (82) మరియు డుప్లెసిస్ (79) లు ఇద్దరూ అర్ద సెంచరీలతో రాణించి మ్యాచ్ ను సులభంగా గెలిచేలా చేశారు. వీరిద్దరి షాట్ సెలక్షన్ మరియు టెక్నిక్ కు అభిమానులు ఫిదా అయ్యారని చెప్పాలి. ఈ రోజు కూడా అదే రకమైన ఐ ఫీస్ట్ లాంటి ఇన్నింగ్స్ ను వీరిద్దరి నుండి మనము చూడగలమా అన్నది తెలియాలంటే ఛేజింగ్ వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news