అసుస్ నుంచి ఆర్‌వోజీ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు..!

-

అసుస్ రిపబ్లిక్ ఆఫ్ గేమ‌ర్స్ (ఆర్‌వోజీ) సిరీస్‌లో ప‌లు కొత్త ల్యాప్‌టాప్‌లు భార‌త్‌లో సోమ‌వారం విడుద‌ల‌య్యాయి. స్ట్రిక్స్ జి15, జి17, స్ట్రిక్స్ స్కార్ 15, 17 ఇంచ్ మోడ‌ల్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌లు ల‌భిస్తున్నాయి. వీటిల్లో ఇంటెల్ కోర్ ఐ7 హెచ్ సిరీస్ 10వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఇంటెలిజెంట్ కూలింగ్ టెక్నాల‌జీ, ట్రిపుల్ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌, వేగ‌వంత‌మైన ర్యామ్‌, వైఫై 6, నానో ఎడ్జ్ డిస్‌ప్లే వంటి అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను ఈ ల్యాప్‌టాప్‌ల‌లో అందిస్తున్నారు.

asus launched ROG Strix series new gaming laptops

వీటిల్లో 300 హెడ్జ్ వ‌ర‌కు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల గేమ్స్ మ‌రింత స్మూత్‌గా ర‌న్ అవుతాయి. ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్‌టీఎక్స్ 2080 గ్రాఫిక్ కార్డుల‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల అద్భుత‌మైన గ్రాఫిక్స్ ఎక్స్‌పీరియెన్స్ పొంద‌వ‌చ్చు.

అసుస్ ఆర్వోజీ స్ట్రిక్స్ జి15 ప్రారంభ ధ‌ర రూ.79,990గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆర్‌వోజీ స్ట్రిక్స్ జి17 ల్యాప్‌టాప్ ప్రారంభ ధ‌ర రూ.1,04,990గా ఉంది. దీన్ని అమెజాన్‌లో విక్ర‌యిస్తున్నారు. ఆగ‌స్టు 3వ వారం నుంచి ఈ ల్యాప్‌టాప్ ల‌భిస్తుంది.

అసుస్ ఆర్‌వోజీ స్ట్రిక్స్ స్కార్ 15 ల్యాప్‌టాప్ ప్రారంభ ధ‌ర రూ.1,44,990గా ఉంది. దీన్ని సెప్టెంబ‌ర్ 3వ వారం నుంచి విక్ర‌యిస్తారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రెండు మాధ్య‌మాల్లోనూ ల‌భిస్తుంది. అసుస్ స్ట్రిక్స్ స్కార్ 17 ల్యాప్‌టాప్ ధ‌ర‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. సెప్టెంబ‌ర్‌లో దీన్ని విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news