రంగారెడ్డిలో దారుణం.. చిన్నారులను డీకొట్టిన స్కూల్ బస్సు

-

నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులను డీకొట్టింది ప్రైవేట్ స్కూల్ బస్సు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వలస కార్మికుల కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పొట్టకూటి కోసం కవిత రైస్ మిల్ లో కార్మికులుగా గత కొన్నేండ్లుగా పనిచేస్తున్న రెండు వలస కార్మికుల కుటుంబాల్లో స్కూల్ బస్సు తీవ్ర విషదాన్నినింపింది. కిరాణా షాప్ కి వెళ్తున్న కాజల్(12).. అభిషేక్(08) లను ఇబ్రహీంపట్నం హై స్కూల్ కి చెందిన బస్సు ఢీ కొట్టగా అక్కడికక్కడే కాజల్ మృతి చెందగా,అభిషేక్ తీవ్ర గాయలపాలయ్యడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news