చంద్రబాబు దొంగ అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు : ఆదిమూలపు సురేశ్‌

-

చంద్రబాబు దొంగ అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కోర్టులను మేనేజ్ చేసుకుంటూ ప్రతిసారి తప్పించుకుంటున్నారని విమర్శించారు. పూర్తి ఆధారాలతోనే ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈసారి చంద్రబాబు అనే దొంగ దొరికిపోయారని, ముందు నుంచి తాము చెప్పుతున్నది నిజమనే విషయం ఇప్పుడు తేలిందని అన్నారు. ఈసారి చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Lokesh has no moral right to conduct Yuva Galam: Minister Audimulapu Suresh

ఇక, టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి దళితుల కోసం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు.. వైవీపై కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.. మాలాంటి చాలా మంది వైవీ ప్రోత్సాహం వల్లే ఈ స్థితిలో ఉన్నామని మంత్రి తెలిపారు. వైసీపీ నాయకులను దళిత వర్గాలకు దూరం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ జగన్ వెంటే ఉన్నారు.. మేమంతా వైఎస్ కుటుంబానికి వీర విధేయులం, వారికి అండగా ఉంటామని ఆయన చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news