ఏపీ మహిళలకు బిగ్ షాక్.. పింఛన్ వయోపరిమితిని పెంచిన జగన్ సర్కార్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు జగన్ సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్ కు సంబంధించిన అర్హత వయస్సును ప్రభుత్వం భారీగా పెంచింది. వైయస్సార్ పింఛన్ కానుక పథకం కింద ఒంటరి మహిళలకు లేదా భర్త నుంచి విడిపోయిన మహిళలకు ఇచ్చే పింఛన్ అర్హత వయస్సును ప్రభుత్వం పెంచింది.

ఇప్పటి వరకు 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తుండగా. ఇక నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 50 ఏళ్లు దాటితే సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. భర్తను వదిలి లేదా భర్త వదిలేసి కనీసం ఏడాది గడిచినా తర్వాతే పింఛను కు అర్హత ఉంటుందని వెల్లడించింది. ఆమె ఒంటరిగా ఉన్నట్లుగా తగిన ధ్రువీకరణ… పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. అవివాహిత మహిళ పింఛన్ అర్హత వయస్సును సైతం జగన్ సర్కార్ భారీగా పెంచింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లోని అవివాహిత మహిళకు 30 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తూ ఉండగా ఆ వయసులో కూడా 50 ఏళ్లు పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news