BREAKING : బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ సరికొత్త రికార్డు… వేలంలో రూ.24.60 లక్షలు

-

బాలాపూర్‌ లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది. గతేడాది 18లక్షల 90వేలు పలికిన లడ్డూ వేలం ఈసారి అంతకుమించి పలికింది. 24 లక్షల 60వేలకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నాడు. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో 9 మంది పోటీపడ్డారు. లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడ్డారు. గతేడాది కంటే రూ.5.70 లక్షలు ఎక్కువ పలికింది.

ఎప్పుడెప్పుడా అని చూస్తున్న వేలంపాటకు వేలమంది భక్తులు తరలివచ్చారు. బాలాపూర్ గణేశ్ మండపం నుంచి భక్తుల నృత్యాలు, కోలాహలం మధ్య ప్రారంభమైన శోభాయాత్ర బాలాపూర్ ముఖ్యకూడలి బొడ్రాయి వద్దుకు చేరుకుంది. ఈ జంక్షన్ వద్ద రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి వచ్చారు. బాలాపూర్ గణపయ్యకు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లడ్డూ వేలం పాట నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news