పునీత్ అంత్యక్రియల కోసం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న బాలయ్య.. పాడే మోసాకే తిరుగు ప్రయాణం..!

-

పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం బాలయ్య ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు సమాచారం. పాడె మోసిన తర్వాతే ఫ్లైట్ ఎక్కుతా నందమూరి బాలకృష్ణ చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రిటర్న్ టికెట్ కూడా బాలకృష్ణ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం విదేశాల నుంచి రాజ్ కుమార్ కుమార్తె వస్తున్నారు.

balayya crying with puneeth rajkumar family

ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియల నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా సాయంత్రం వరకు కంఠీరవ స్టేడియం లోనే బాలకృష్ణ ఉండనున్నారు. బాలకృష్ణతో పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొదట రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. కానీ పునీత్ కుమార్తె ఈరోజు బెంగళూరు చేరడంతో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బాలయ్య పునీత్ మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news