రాడికల్ పబ్‌లో రేవంత్ మేనల్లుడు.. బీజేపీ నేత కొడుకు.. ఫోటోలు బయటపెట్టిన టిఆర్ఎస్ !

-

రాడికల్ పబ్‌ వ్యవహారంపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిల్లలు ఎంత పెద్ద వారు అయినా పోలీసులు వదిలి పెట్టకూడదని.. గతంలో హైద్రాబాద్ లో ఉన్న పేకాట క్లబ్ లు అన్ని కాంగ్రెస్ నాయకులవన్నారు బాల్క సుమన్. రేవంత్ రెడ్డి ఎవరిని ఉరి తీయాలో ఇప్పుడు చెప్పాలి.. తన మేనల్లుడు ను ఉరి తీయాలా ? అని నిలదీశారు.

పబ్ లో రేవంత్ రెడ్డి మేనల్లుడు ఉన్నాడని మండిపడ్డారు. సైకో సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మద్యం మత్తు లో, డ్రగ్స్ మత్తులో ఊగుతున్నది, సాగుతున్నది బీజేపీ కాంగ్రెస్ నాయకులు, వారి పిల్లలే అని మండిపడ్డారు. ఇలాంటివి బంద్ చేయకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదని… డ్రగ్స్ మత్తు లో చిందు వేస్తున్నది టీ ఆర్ ఎస్, బీజేపీ నాయకుల పిల్లలేనని నిప్పులు చెరిగారు.

పార్టీ లో ఎక్కువ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ నాయకులు అని.. శ్రీరంగ నీతులు మాట్లాడుతున్న వారిని తెలంగాణ సమాజం గుర్తిస్తోందని అగ్రహించారు. ప్రభుత్వం ఎంత దూరం అయినా వెళ్తుందని.. డ్రగ్స్ మత్తు లో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారన్నారు. హైద్రాబాద్ ఇమేజ్ ను పడగొట్టే పనులు కాంగ్రెస్ బీజేపీ నాయకులు బంద్  చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news