కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని ఇంటిపోరు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలు: బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ కు ఇంటి పోరు ప్రారంభం అయిందని.. తెలంగాణలో కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి చూస్తున్నాడని.. అందుకోసమే జాతీయ రాజకీయాలు అంటూ.. కొత్త డ్రామా ప్రారంభించారని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. సర్జికల్ స్ట్రైక్ పై వ్యాఖ్యలు చేసినందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ ని డిమాండ్ చేశారు. పుట్టిన రోజున ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. చైానా, పాకిస్తాన్, తాలిబన్లపై కేసీఆర్ కు ప్రేమ పెరుగుతుందని .. పాత బస్తీ అంటే ఇప్పటికే ప్రేమ ఉందని ఆయన విమర్శించారు. కేసీఆర్ దేశపౌరుడా కాదా..అని డీఏన్ఏ టెస్ట్ చేయాలంటూ.. విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కలిసి దోబూచులాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. టీఆర్ఎస్ కు ఓటేసినట్లే అని బండి సంజయ్ అన్నారు. ఈరెండు పార్టీలు కలిసిపోటీ చేస్తాయని తెలంగాణ ప్రజలకు స్పష్టం అయిందన్నారు. టీఆర్ఎస్ గడీలు బద్దలు కొట్టే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీయే అని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న కేసీఆర్ ని ఎదుర్కొనెందుకు యువ తెలంగాణ వంటి పార్టీలు బీజేపీలో విలీనం అవుతున్నాయని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news