బండి సంజయ్ పర్యటనలో మళ్లీ ఉద్రికత్త.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ

-

బండి సంజయ్ పర్యటనలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న నల్లగొండ జిల్లా అర్జాల బావిలో జరిగిన విధంగానే నేడు సూర్యాపేట, వరంగల్లో కూడా టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ యాత్రకు అడ్డుతగిలారు. నల్ల జెండాలను చూపిస్తూ బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో ఇటు బీజేపీ శ్రేణులు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మరోవైపు ఆటోలో తరలిస్తున్న కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బండి సంజయ్ కాన్వాయ్ ను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బండి సంజయ్ పర్యటన ఉందని తెలిసి కూడా పోలీసులు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటు బండి సంజయ్, అటు టీఆర్ఎస్ ఎక్కడా తగ్గడంలేదు. పర్యటన కొనసాగిస్తానని బండి సంజయ్ అంటుంటే… అడ్డకునే తీరుతాం అని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news