BREAKING : బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్..

-

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ… అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్… పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మరియు.. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా… ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు.

ఇప్పటికే వంద కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు బండి సంజయ్ కుమార్.. అయితే బండి సంజయ్ పాదయాత్ర కు మరోసారి బ్రేక్ పడింది. సెప్టెంబర్ 17 వ తేదీన బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… సెప్టెంబర్ 17 వ తేదీన తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు రానున్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో ఈ సందర్భంగా అమిత్ షా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ తన పాదయాత్రను 17వ తేదీన రద్దు చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ బిజెపి పార్టీ కీలక ప్రకటన చేసింది. కాగా ప్రస్తుతం బండి సంజయ్ నిర్వహిస్తున్న సంగ్రామ యాత్ర కామారెడ్డి కి చేరుకుంది. ఇవాళ కామారెడ్డి నుంచి నిర్మల్ వెళ్లనున్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news