సీఎం ఏం చేసినా కమీషన్ల కోసమే: బండి సంజయ్

-

సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుస్నాబాద్‌లో పర్యటించారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గుర్తుకొస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నేటి వరకు ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను తనకు తానే సమీక్ష చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు. కరోనా సమయంలో వందలాది మంది చనిపోయిన ఏ ఒక్క రోజు కరోనా జాగ్రత్తలపై మాట్లాడలేదని విమర్శించారు. కోవిడ్ అనే వ్యాధి ఆయన వరకు వచ్చేంతవరకు దాని తీవ్రత ఆయనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. కోవిడ్ సమయంలో కేంద్రం ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని చెపపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. సీఎం ఏం చేసినా కమీషన్ల కోసమేనని బండి సంజయ్ ఆరోపించారు.

ఇక  తెలంగాణలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. కొత్త ఇంచార్జుల నియామకంతో పాటు తెలంగాణలో బీజేపీ బలంపైనా అంచనాలు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు కింది స్థాయి సమస్యలు తెలుసుకుని కార్యచరణ రూపొందించుకోవాలని దిశా నిర్దేశం చేసింది. ప్రభుత్వం వ్యతిరేకాన్ని నిరసనల రూపంలో తెలియ జేయాలని పార్టీ నేతలకు సూచించింది. దీంతో బండి సంజయ్ దూసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదిస్తూ మాటల దాడి పెంచారు.

 

Read more RELATED
Recommended to you

Latest news