రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలోకి బూరనర్సయ్య గౌడ్ : బండి సంజయ్

-

రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారితే.. బీజేపీ ఉద్యమకారులతో నిండిపోతోందని పేర్కొన్నారు. ఇటీవల టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం నర్సయ్య గౌడ్ ఎంతో కష్టపడ్డారని బండి సంజయ్ తెలిపారు.

ఈ నెల 19న దిల్లీలో బీజేపీలో చేరుతున్నట్లు బూరనర్సయ్య గౌడ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ను కలవడం టీఆర్ఎస్ నేతలకు ఉద్యమంలా మారిందని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. దిల్లీలోని కేంద్ర కార్యాలయంలో చేరిక ఉంటుందని వెల్లడించారు.

‘రాష్ట్ర భవిష్యత్ కోసమే నర్సయ్య బీజేపీలో చేరుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై స్పష్టత ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సీఎం కేసీఆర్ ఇవ్వడం లేదు. నర్సయ్య గౌడ్ చేరికతో మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం. నర్సయ్య గౌడ్‌ను మోదీ గుర్తించారు, కేసీఆర్ దగ్గరకు కూడా తీసుకోలేదు. మునుగోడులో ఒక గ్రామానికి సీఎంను ఇన్‌ఛార్జిగా పెట్టిన ఘనత బీజేపీది.’- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Read more RELATED
Recommended to you

Latest news