మొయినాబాద్ ఘటనకు కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం కేసీఆర్ దే – బండి సంజయ్‌

-

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సింహయాజి, నందకుమార్, సతీష్ శర్మ ముగ్గురు అరెస్ట్ అయ్యారు. సతీష్ శర్మ వీకె తండ్రి లేట్ కృష్ణమూర్తి ఫరీదాబాద్, డి.సింహయాజి తండ్రి లేట్ డీవీ రమణరావు తిరుపతి, నందకుమార్ తండ్రి శ్యామలప్ప హైదరాబాద్ లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

అయితే.. ఈ మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. మొయినాబాద్ ఫాంహౌస్ బూమరాంగ్‌లో సీఎం కేసీఆర్ కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం & నవ్వులు పూయించారని ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ వాళ్లదే ఫామ్‌హౌస్, టీఆర్ఎస్ నేతలే ఫిర్యాదు చేశారు, టీఆర్ఎస్ నేతలే బాధితులు, టీఆర్ఎస్ నేతలే నేరస్థులు అవుతారని చురకలు అంటించారు. బీజేపీ చేసిందని మీరు చెబితే…మీరు ఈ స్క్రిప్ట్ చేయకపోతే, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వచ్చి దేవుడిపై ప్రమాణం చేయండని.. దీనిపై తేదీని ఫిక్స్ చేయండని సీఎం కేసీఆర్‌ కు ఛాలెంజ్‌ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news