తెలంగాణ పోలీసులు హీరోలు..మాట మార్చేసిన బండి సంజయ్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసుల విషయంలో మాట మార్చారు. కొందరు పోలీస్ అధికారులు టీఆర్ఎస్ నేతలాలా మాట్లాడుతున్నారని ఐపీఎస్ వ్యవస్థను సీఎం అవమానిస్తుంటే పోలీస్ అధికారులు సంఘం ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ అడ్డం తిరిగింది.. అందుకే పోయి ఫార్మ్ హౌస్ లో పడుకున్నాడని అన్నారు. బీజేపీ లో చేరేందుకు వస్తున్న ఖమ్మం వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేశారు.. మీకు వ్యాపారాలు ఉన్నాయని బెదిరించారని ఆయన అన్నారు.

bandi-sanjay
bandi-sanjay

తెలంగాణ పోలీస్ లు హీరోలన్న ఆయన నిజాయితీగా వ్యవహరించే పోలీసులకు 15 నిమిషాలు అప్పగించు సంఘ విద్రోహ శక్తులను , రోహింగ్యాల ను జల్లడ పడతారు అంటూ ఆయన పోలీసులను ప్రశంసించారు. సీఎం దమ్ము ఉంటే అపని చేయి .. తెలంగాణ పౌరుషం ఉంటే పోలీస్ లకు అధికారం ఇవ్వు అంటూ ఆయన సవాల్ విసిరారు. మేము మేయర్ గా గెలిస్తే పోలీసులకు పాత బస్తి అప్పగించాలని అనుకున్నామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news