కెసిఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ..పోడు భూముల్లో హరితహారం నిలిపివేయాలంటూ..

-

తెలంగాణలో పోడు భూముల వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఓ బహిరంగ లేఖ రాశారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని బండి సంజయ్ ఆ లేఖలో కోరారు. అదే సమయంలో పోడు భూముల్లో చేపడుతున్న హరితహారం పనులను తక్షణమే నిలిపివేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరించకుండానే.. ఆ భూముల్లో హరితహారం పనులు చేపట్టడం గిరిజనులను వంచనకు గురి చేయడమేనని ఆయన ఆరోపించారు.

హరితహారం కార్యక్రమానికి తాము వ్యతిరేకం కాదని చెప్పిన బండి సంజయ్.. ఇతరత్రా భూములను వదిలేసి కేవలం పోడు భూముల లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న దాదాపు 3.5 లక్షల మంది గిరిజన రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఈ విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news