బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బండి సంజయ్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ని పోలీసులు అబ్దుల్లాపూర్​మెట్ పీఎస్ నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. బండిని అరెస్ట్ చేశారని తెలుసుకున్న కాషాయ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేశారు. ఈ క్రమంలో పరిస్థితులు అదుపు తప్పకూడదని భావించిన పోలీసులు బండి సంజయ్​ను పార్టీ కార్యాలయానికి తరలించారు. కార్యాలయం నుంచి మునుగోడు ఉపఎన్నిక పోలింగ్​పై ఆరా తీస్తున్నారు.

మునుగోడులోనే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎన్నికల కమిషన్‌ పట్టించుకోవడం లేదంటూ బండి సంజయ్‌ బుధవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌ నుంచి ఆ నియోజకవర్గానికి బయల్దేరగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నగరం నుంచి వెళ్తున్న బండిని పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. చివరకు అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద అరెస్టు చేసి పోలీస్​స్టేషన్‌కు తరలించారు .అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌లో బండి సంజయ్​ని అర్ధరాత్రి నుంచి నిర్బంధించారు. బండి సంజయ్‌ వెంట వీరేందర్‌ గౌడ్‌, ఎన్‌.వి సుభాష్‌, సంగప్ప ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news