నేను బరాబర్ 80 శాతం హిందువుల కోసమే పోరాటం చేస్తా- బండి సంజయ్

-

టీఆర్ఎస్ నేతలు కన్పించిన జాగనల్లా కబ్జా చేస్తూ జనాన్ని దోచుకుంటున్నారు… చివరకు పేదల, ఆరె కటికెల భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. కేసీఆర్ కేబినెట్ లో వెంచర్ల కబ్జా శాఖను ఏర్పాటు చేస్తారేమో…కుల వ్రుత్తులను కేసీఆర్ నాశనం చేస్తున్నరు. దీని గురించి ప్రశ్నిస్తే… నన్ను మతతత్వవాదులంటారా? అని నిలదీశారు. నేను బరాబర్ 80 శాతం హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చి హిందూ సంఘటనా శక్తి దమ్మేంటో చూపిస్తానని.. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు కుక్కల్లా మొరుగుతున్నరు.. ఎంతైనా మొరగండి.. జడ్చర్ల ప్రజలకు న్యాయం చేయండని ఫైర్‌ అయ్యారు.

ఎస్సీ, ఎస్టీ పేదలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలను కేసీఆర్ ధరణి పేరుతో లాక్కుంటూ నిలవనీడలేకుండా చేస్తున్నారని… కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న ఇక్కడ టీఆర్ఎస్ నేతలు గుంట నక్కల్లా ఇసుక, మట్టి, భూముల దోపిడీ చేస్తూ జనాన్ని పీడిస్తున్నారని నిప్పులు చెరిగారు.

డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భ్రుతి ఎందుకు ఇవ్వడం లేదని ఇక్కడి కేసీఆర్ ను అడగలేని అసమర్థులు టీఆర్ఎస్ నేతలు అని..ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు వరకు జీతాల్లేవు. బ్యాంకులు లోన్లు ఇస్తలేరు. ఆర్టీసీ ఛార్జీలు పెంచినా ఆర్టీసీ కార్మికులకు 5 టీఏలు, 2 డీఏలు ఇవ్వడం లేదని ఆగ్రహించారు బండి సంజయ్. కానీ కేసీఆర్ మాత్రం తన కుటుంబంలో ఐదుగురికి పదవులిచ్చి నెలనెలా రూ.25 లక్షల జీతాలు ఠంచన్ గా తీసుకుంటున్నారని…దీనికోసమేనా తెలంగాణ తెచ్చుకుంది? శ్రీకాంతా చారి ఆత్మ క్షోభిస్తోందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news