కోడలికి మత్తు మందు ఇచ్చిన అత్త.. తాంత్రికుడి లైంగికదాడి

-

కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి.. ఓ మహిళపై దొంగ బాబా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తమామలు కోడలిని వేధించసాగారు. అయితే కాగా, కుటుంబ సమస్యను తొలగిస్తానని ఓ దొంగ బాబా కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి, దాని కోసం మీ ఇంటి కోడలును కొన్ని నెలలపాటు తన వద్ద ఉంచాలని భర్త, అత్తమామలను నమ్మించాడు. దీనికి ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో.. రెండు నెలల కిందట అత్త మత్తు మందు ఇచ్చి కోడలిని తాంత్రికుడి వద్దకు చేర్చింది. ఆమె స్పృహలోకి వచ్చి చూడగా తాంత్రికుడి గదిలో రెండున్నర ఏళ్ల కుమారుడితో పాటు ఉంది.

ఆ మహిళను ఒక గదిలో బంధించిన దొంగ బాబా.. పసి బాలుడి ఎదుటే 79 రోజులు ఆమెపై వరుసగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏప్రిల్‌ 28న ఆమెను బంధించిన గదిలో తన మొబైల్‌ ఫోన్‌ను తాంత్రికుడు మరిచిపోయాడు. దీంతో ఆ మహిళ తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పడంతో. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు తాంత్రికుడు మహిళను బంధించిన ప్రాంతానికి శుక్రవారం చేరుకున్నారు. ఆమెతో పాటు కుమారుడిని అక్కడి నుంచి రక్షించారు. అయితే అప్పటికే ఆ తాంత్రికుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళపై రెండు నెలలకుపైగా లైంగిక దాడికి పాల్పడిన తాంత్రికుడితోపాటు ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తమామలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news