యాదాద్రి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన భేరాసారాల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. గుండంలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయానికి చేరుకున్నారు. యాదాద్రి స్వామివారి సన్నిధిలో బండి సంజయ్ తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ తమది కాదని ఆయన స్వామివారి పాదాల దగ్గర ప్రమాణం చేశారు.

 

అయితే బండి సంజయ్ పర్యటనకు పోలీసుల అనుమతి లేని కారణంగా యాదాద్రి లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యాదాద్రిలో పోలీసులు భారీగాా మోహరించారు. అయితే మోయినాబాద్ ఎపిసోడ్ లో తన పాత్ర లేదని.. ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news