నువ్వు కూడా ఈడీ విచారణకు రావాల్సిందేనని..కేసీఆర్‌ కు బండి సంజయ్‌ హెచ్చరిక

-

నువ్వు కూడా ఈడీ విచారణకు రావాల్సిందేనని..కేసీఆర్‌ కు బండి సంజయ్‌ హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ నువు జాగ్రత్త.. రూ. 800 కోట్లతో ప్రగతి భవన్ కట్టుకొని జల్సాలు చేస్తున్నావని ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ లో మాత్రం లేవు… అల్లుడు హరీష్ రావుకి సిగ్గులేదు.. హరీష్ రావును ఎవరు పట్టించుకోవద్దని కేసీఆర్ అప్పట్లో అన్నారని మండిపడ్డారు.

ఆయన ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు.. యువతకీ మాత్రం ఉద్యోగాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్‌ కుమార్‌. క్యాబినెట్ లో అంత తెలంగాణ ద్రోహులు ఉన్నారు… ఉద్యమ కారులను రోడ్డు మీద వేశారని ఫైర్‌ అయ్యారు. ఈడీ విచారణకు పిలిపిస్తే కాంగ్రెస్ ఆందోళన చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉండాలని ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు బండి సంజయ్‌. అప్పనంగా ఆస్తులు సంపాదించి డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని చెప్పుకొచ్చారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news