బండి సంజయ్ నాలుగో విడత సంగ్రామ యాత్ర..షెడ్యూల్ విడుదల

-

తెలంగాణ బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ నాలుగో విడత సంగ్రామ యాత్ర కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ విడతలో 10 రోజులలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు… 115.3 కి.మీలు పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్‌. ఇక ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు కాగా… మొత్తం 10 రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది.

4వ విడతలో భాగంగా మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115.3 కి.మీల మేర పాదయాత్ర కొనసాగనుంది. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్న బండి సంజయ్ కుమార్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నారు.

ఈనెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజు పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే… కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version