బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి – బండ్ల గణేష్ సెటైర్లు

-

నిన్న తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌తో కలిసి మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అయితే, తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనంతరం విజయ సాయిరెడ్డితో ముచ్చటించారు.

ఆయన పక్కకు కూర్చొని.. తారక రత్న గురించి, మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఇక దీనిపై బండ్ల గణేష్‌ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయి, ట్వీట్‌ చేశారు. నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం అన్నారు బండ్ల గణేష్‌. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news