పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు

-

బీఆర్ఎస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఆదివారం నోటీసులు ఇచ్చింది.

కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు తమిళిసై  గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొంది జాతీయ మహిళా కమిషన్. ఈ మేరకు ఈ నెల 21న ఉదయం 11:30 నిమిషాలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఒక వేళ హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది జాతీయ మహిళా కమిషన్. మరి దీనిపై బీఆర్ఎస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news