సీతానగరం రేప్ బాధితులకు షాక్

-

అమరావతి: సీతానగరంలో ఇటీవల కాలంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలుస్తూ చెక్కులు అందజేసింది. ఈ చెక్కకు ‌ చిక్కులు వచ్చాయి. బాధితురాలికి ప్రభుత్వం రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్కు అందించింది. దీంతో పాటు స్త్రీ.శిశు సంక్షేమశాఖ తరపున రూ .25 వేల చెక్కు అందచేశారు. అయితే రూ. 25 వేల చెక్కు విషయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో బ్యాంకు అధికారులు చెక్ పాస్ చేయకుండా నిలిపి వేశారు. త్వరలో మరో చెక్‌ను అందిస్తామని చెప్పారు.

దీంతో బ్యాంకు అధికారుల తీరుతో బాధిత కుటుంబం విస్తుపోయింది. రూ.5 లక్షల చెక్కులో కూడా ఇలానే ఉంటుందోమోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన చెక్కుకే చిక్కులు రావడంతో స్థానిక నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పరిస్థితి ఇదీ అని ఎద్దేవా చేశారు. బాధితులకు వెంటనే మరో చెక్కును అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news