తెలంగాణ కోసమే పుట్టా అని చెప్పుకుంటున్న కేసీఆర్.. మోదీని ఎందుకు విమర్శించడం లేదు- బట్టి విక్రమార్క

-

తెలంగాణ కోసమే పుట్టా అని, తెలంగాణ కోసమే పార్టీ పెట్టా అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ చాలా కష్టాలకు ఓర్చి ఇచ్చిందని.. నరేంద్ర మోదీ నువ్వు ఉంటే ఇచ్చేవాడివి కాదని కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టిన సమయంలో ప్రతీ ఓటు విలువైనప్పుడు.. టీఆర్ఎస్ పార్టీ ఎంపీవిగా ఉన్న నువ్వు సభ నుంచి పక్కకు వెళ్లావని విమర్శించారు. నువ్వు బయటకు  రాకుండా హరీష్ రావును పంపించి.. కాంగ్రెస్ వల్లే యువత చనిపోయారని విమర్శిస్తున్నారని అన్నారు.

batti
batti

తెలంగాణ మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా బయటకు వచ్చి చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. నువ్వు బయటకు వచ్చి చెప్పకుంటే.. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసిపోయి నాటకం ఆడుతున్నట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఉత్తరాది రాష్ట్రాలకు ఒక లాగా, దక్షిణాది రాష్ట్రాలకు మరోలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు బట్టి విక్రమార్క. మోదీ దేశ ప్రధానిలా కాకుండా.. అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news