ఆస్పత్రిలో ఉన్న పంత్‌ కు BCCI శుభవార్త..వరల్డ్‌ కప్‌ జట్టులో ఛాన్స్‌ !

-

ఆస్పత్రిలో ఉన్న రిషబ్‌ పంత్‌ కు BCCI శుభవార్త చెప్పింది. కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, ‘పంత్ కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది.

శ్రీలంక, న్యూజిలాండ్ తో జరిగే వైట్ బాల్ సిరీస్ లు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్, ఐపీఎల్ లో ఆడటం కష్టమే. కానీ, వరల్డ్-2023 ఫైనల్ వరకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది’ అని చెప్పాడు.

కాగా, గత శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ నుదుటికి వైద్యులు చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఈ మేరకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ వెల్లడించారు. పంత్ ఫేస్ పై గాయాలు కావడంతో.. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news